స్పేస్ నుంచి ట్వీట్ చేసిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 30, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొలిసారిగా ట్వీట్ చేశారు. ఐదు రోజుల క్రితం కజకిస్తాన్లోని బైకనూర్ నుంచి సోయుజ్ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి హజ్జా చేరుకున్న విషయం విదితమే. తాను చేసిన తొలి ట్వీట్లో, ఐఎస్ఎస్కి సంబంధించిన ఫొటోని షేర్ చేశారు. క్షణాల్లో ఈ ట్వీట్కి లైక్లు, రీ-ట్వీట్లు, కామెంట్లు పోటెత్తాయి. యూఏఈ నుంచి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తిగా హజ్జా అల్ మన్సౌరి ఇప్పటికే రికార్డు సృష్టించిన విషయం విదితమే. అక్కడ ఆయన తన ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. త్వరలో ఆయన తిరిగి భూమిని చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!