రోడ్డు ప్రమాదం: స్టూడెంట్కి గాయాలు
- September 30, 2019యూఏఈ: కల్బా ప్రాంతంలో రెండు స్కూల్ బస్సులు ఢీ కొన్న ఘటనలో ఓ స్టూడెంట్కి గాయాలయ్యాయి. రెండు స్కూల్ బస్సులు, విద్యార్థుల్ని స్కూల్స్కి తీసుకెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బస్సులో 10 మంది స్టూడెంట్స్ వుండగా, మరో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. రోడ్డుని సరిగ్గా గమనించకుండా ఓ బస్ డ్రైవర్, ఇంటర్నల్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదకు బస్సుని తీసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు, సంఘటనా స్థలానికి అంబులెన్స్, రెస్క్యూ యూనిట్స్, పెట్రోల్ మరియు ట్రాఫిక్ ఎక్స్పర్ట్లను పంపించడం జరిగింది. గాయపడ్డ విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. మిగతా విద్యార్థుల్ని స్కూల్స్కి పంపించడం జరిగింది. బస్ డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత