డీడీ అసిస్టెంట్ డైరెక్టర్‌పై మోడీ వేటు

- October 03, 2019 , by Maagulf
డీడీ అసిస్టెంట్ డైరెక్టర్‌పై మోడీ వేటు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేసిన దూరదర్శన్ చానల్ అసిస్టెంట్ డైరెక్టర్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే..ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 30న ఐఐటీ మద్రాస్‌లో నిర్వహించిన కన్వెన్షన్ ప్రోగ్రాంలో ఇచ్చిన ప్రసంగాన్ని చెన్నై దూరదర్శన్‌ విభాగమైన డీడీ పొథిగై ప్రత్యక్ష ప్రసారం చేయలేదు.
 
దీంతో ఆ చానల్ అసిస్టెంట్‌ డైరెక్టర్‌పై వేటు పడింది. ఉన్నతాధికారుల అనుమతి ఉన్నపటికీ మోదీ ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని ప్రధాని కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను కోరింది. దీంతో డీడీ పొథిగై అసిస్టెంట్ డైరెక్టర్‌ ఆర్ వసుమతిని ప్రసారభారతి సస్పెండ్ చేసి మోదీ ప్రసంగాన్ని ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయలేదో వివరణ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com