భారీగా తగ్గిన వెండి ధర
- October 04, 2019గత కొన్ని రోజులుగా.. బంగారం ధరలు ఆకాశన్నంటాయి. ఆ తర్వాత.. అటూ.. ఇటూగా తగ్గుతూ.. ఉంటోంది. కాగా.. పసిడి ధరతో పాటుగా వెండి ధరలు కూడా అమాంతంగా పెరుగుతూ వచ్చాయి. ఒకానొక సమయంలో.. 58 వేల బెంజ్ మార్క్ని దాటింది. దీంతో.. వెండి వైపు చూడమే మానేశారు ప్రజలు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరింత పెరుగుతూ.. వినియోగదారులకు షాకిస్తున్నాయి. అయితే.. అనుకోని విధంగా.. శుక్రవారం వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ. . ఏకంగా 2,300 రూపాయలు తగ్గి.. 45,750కి చేరింది వెండి. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతోనే వెండి ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా.. వెండి ధరలు తగ్గుతూ ఉంటే.. బంగారం మాత్రం రూ.900లు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల, 10 గ్రాములు రూ. 39,200లకు చేరింది. అలాగే.. 22 క్యారెట్ల .. 10 గ్రాముల బంగారు ఆభరణాల ధర 36,500లుగా మార్కెట్లో పలుకుతోంది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్