సౌదీ అరేబియాలో విద్యుదాఘాతంతో కేరళ యువకుడు మృతి
- October 04, 2019
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో కేరళ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కేరళలోని మలప్పురం జిల్లా వాసి ఇషాఖాలి మెలేదాత్(30) జెడ్డాలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో ఉండగా ఇషాఖాలి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురయ్యాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మరణ వార్త తెలుసుకున్న జెడ్డా కేఎంసీసీ సంక్షేమ విభాగం నేతలు ముహ్మద్ కుటీ పనాకద్, జలీల్ ఒఝుకుర్ వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అతడి మృతదేహాన్ని సొంతూరికి పంపించే ఏర్పాట్లు చేశారు. మృతుడికి భార్య అమ్నా, కొడుకు అమిన్ షాన్ ఉన్నారు. ఇషాఖాలి మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!