ఫ్రాన్స్ కు బయలుదేరిన రాజ్నాథ్ సింగ్
- October 07, 2019
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే ఫ్రాన్స్ కు బయలుదేరారు. ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని స్వీకరించడానికి రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటన చేపట్టారు. భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవమైన అక్టోబర్ 8 న ఫ్రాన్స్, భారత్ కు తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొని, తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకుంటారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్కు చెందిన అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏటా సంప్రదాయబద్ధంగా జరుపుకునే 'ఆయుధ పూజ' ను కూడా రాజ్నాథ్ తన పర్యటన సందర్భంగా ఫ్రాన్స్లో జరుపుకొంటారు. రాఫెల్ యుద్ధ విమానంలో కొద్దిసేపు విహరిస్తారు. ఫ్రాన్స్ ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఉన్నత స్థాయి నేతలతో రాజ్నాథ్ ఈ నెల 9 న సమావేశమవుతారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!