ఫ్రాన్స్ కు బయలుదేరిన రాజ్నాథ్ సింగ్
- October 07, 2019కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే ఫ్రాన్స్ కు బయలుదేరారు. ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని స్వీకరించడానికి రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటన చేపట్టారు. భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవమైన అక్టోబర్ 8 న ఫ్రాన్స్, భారత్ కు తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొని, తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకుంటారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్కు చెందిన అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏటా సంప్రదాయబద్ధంగా జరుపుకునే 'ఆయుధ పూజ' ను కూడా రాజ్నాథ్ తన పర్యటన సందర్భంగా ఫ్రాన్స్లో జరుపుకొంటారు. రాఫెల్ యుద్ధ విమానంలో కొద్దిసేపు విహరిస్తారు. ఫ్రాన్స్ ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఉన్నత స్థాయి నేతలతో రాజ్నాథ్ ఈ నెల 9 న సమావేశమవుతారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు