అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్
- October 09, 2019
పాకిస్థాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. దేశం అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వచ్చిన ఏడాదిలోపే పాకిస్థాన్ 7లక్షల కోట్ల అప్పు తెచ్చింది.
గతంలో ఎన్నడూ కూడా ఒకే ఏడాది ఈస్థాయిలో అప్పు తీసుకురాలేదు. ఈ ఏడు లక్షల కోట్ల అప్పులో 2.8 లక్షల కోట్ల విదేశాల నుంచి తీసుకుంది. మిగిలిన అప్పును స్వదేశంలోనే సేకరించింది పాక్ ప్రభుత్వం.
ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం అప్పు రూ. 32 లక్షల 24వేల కోట్లకు చేరింది. ఇమ్రాన్ అధికార పగ్గాలు స్వీకరించకముందు పాక్ అప్పు 24 లక్షల 73వేల కోట్లుగా ఉండేది. అయితే పన్నుల వసూలులో మాత్రం పాకిస్థాన్ అనుకున్న లక్ష్యానికి దగ్గరగా రాగలిగింది. ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసకానికి లక్ష కోట్ల మేర పన్నుల వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా. 96వేల కోట్లను వసూలు చేసింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!