దీపావళి కానుక: ఉద్యోగుల జీతం పెంపు
- October 09, 2019కేంద్ర ప్రభుత్వం బుధవారం దీపావళి కానుక ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే టీఏడీఏలో 5శాతం పెంచుతున్నట్లు శుభవార్తను వినిపించింది. పెన్షనర్లకు, ప్రస్తుత ఉద్యోగులకు ఇస్తున్న వేతనంలో డియర్నెస్ అలోవెన్స్ను పెంచనున్నారు. వినియోగదారుల డిమాండ్ పెరుగుతుండటం దానికి తగ్గట్లు ఆర్థిక మందగమనంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. 2019 జులై నెల నుంచి ఈ అల్లోవెన్సు అమలులోకి రానుంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతాయి. దీని ద్వారా 50లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందడమే కాక, 62లక్షల మంది పెన్షనర్లకు కూడా ఇది వర్దిస్తుంది.
ప్రధాని మోడీ నాయకత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ఒకటే ఉద్యోగులకు 5శాతం డీఏ పెంచడమని జవదేకర్ తెలిపారు. ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు సెక్టార్లలో వృద్ధి రేటు తగ్గడంతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ నిర్ణయంతో సేవలు మరింత వేగమయ్యే సూచనలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం