దీపావళి కానుక: ఉద్యోగుల జీతం పెంపు
- October 09, 2019
కేంద్ర ప్రభుత్వం బుధవారం దీపావళి కానుక ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే టీఏడీఏలో 5శాతం పెంచుతున్నట్లు శుభవార్తను వినిపించింది. పెన్షనర్లకు, ప్రస్తుత ఉద్యోగులకు ఇస్తున్న వేతనంలో డియర్నెస్ అలోవెన్స్ను పెంచనున్నారు. వినియోగదారుల డిమాండ్ పెరుగుతుండటం దానికి తగ్గట్లు ఆర్థిక మందగమనంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. 2019 జులై నెల నుంచి ఈ అల్లోవెన్సు అమలులోకి రానుంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతాయి. దీని ద్వారా 50లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందడమే కాక, 62లక్షల మంది పెన్షనర్లకు కూడా ఇది వర్దిస్తుంది.
ప్రధాని మోడీ నాయకత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ఒకటే ఉద్యోగులకు 5శాతం డీఏ పెంచడమని జవదేకర్ తెలిపారు. ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు సెక్టార్లలో వృద్ధి రేటు తగ్గడంతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ నిర్ణయంతో సేవలు మరింత వేగమయ్యే సూచనలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







