దీపావళి కానుక: ఉద్యోగుల జీతం పెంపు
- October 09, 2019కేంద్ర ప్రభుత్వం బుధవారం దీపావళి కానుక ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే టీఏడీఏలో 5శాతం పెంచుతున్నట్లు శుభవార్తను వినిపించింది. పెన్షనర్లకు, ప్రస్తుత ఉద్యోగులకు ఇస్తున్న వేతనంలో డియర్నెస్ అలోవెన్స్ను పెంచనున్నారు. వినియోగదారుల డిమాండ్ పెరుగుతుండటం దానికి తగ్గట్లు ఆర్థిక మందగమనంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. 2019 జులై నెల నుంచి ఈ అల్లోవెన్సు అమలులోకి రానుంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతాయి. దీని ద్వారా 50లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందడమే కాక, 62లక్షల మంది పెన్షనర్లకు కూడా ఇది వర్దిస్తుంది.
ప్రధాని మోడీ నాయకత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ఒకటే ఉద్యోగులకు 5శాతం డీఏ పెంచడమని జవదేకర్ తెలిపారు. ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు సెక్టార్లలో వృద్ధి రేటు తగ్గడంతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ నిర్ణయంతో సేవలు మరింత వేగమయ్యే సూచనలు ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..