శశికళకు జైలులో రాజభోగాలు: ముందస్తు విడుదల లేనట్లే!
- October 10, 2019
అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉంటున్న మాజీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు విలాసవంతమైన సదుపాయాలు అందిన మాట వాస్తవమే అని విచారణ కమిటీ నిర్ధారణకు వచ్చింది.. అక్రమంగా సంపాదించిన కేసులో సుప్రీంకోర్టు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా.. ఆమె బెంగళూరులోని జైలులో శిక్ష అనుభవిస్తుంది.
రెండేళ్లకు పైగా జైలులో ఉంటున్న ఆమెకు అగ్రహారం జైలులో ప్రత్యేకంగా ఐదు గదులు, విలాసవంతమైన పరుపులు, వంటగది తదితర సదుపాయాలు కల్పించి ఉండటం చూసి అప్పట్లో జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జైలులో సదుపాయాలు పొందటానికి జైలు అధికారులకు శశికళ రెండు కోట్లకు పైగా ముడుపులు చెల్లించారంటూ రూప విచారణలో కనుక్కోగా.. ఇంకా శశికళ చుడీదార్ ధరించి జైలు నుంచి బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకుని తిరిగి వస్తున్న వీడియోను కూడా ఆమె విడుదల చేశారు.
శశికళకు జైలులో అందిన రాజభోగాలు, ముడుపుల వ్యవహారం, అధికారుల గురించి సమగ్రమైన నివేదికను రూపొందించి ఉన్నత అధికారులకు సమర్పించారు రూప. ఈ క్రమంలో ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్కుమార్ నేతృత్వంలో ఓ విచారణ కమిటీని నియమించింది కర్ణాటక ప్రభుత్వం. వినయ్కుమార్ కమిటీ విచారణ జరిపి ఇటీవలే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో శశికళకు విలాసవంతమైన సదుపాయాలు కల్పించడం వాస్తవమని ఆధారాలతో సహా వెల్లడించింది.
శశికళ సదుపాయాల కోసం అప్పటి జైలు అధికారి సత్యనారాయణకు రూ.2 కోట్లకు పైగా ముడుపులు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. దీనితో శశికళకు జైలు శిక్ష పొడిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ముందస్తు విడుదల చేస్తారని ఇప్పటివరకు అందరూ భావించగా.. ఇక అటువంటి అవకాశం లేకుండా పోయింది.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







