ఫ్లై దుబాయ్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- October 11, 2019
ఫ్లై దుబాయ్ విమానం బకు నుంచి దుబాయ్ వెళుతూ షిరాజ్ షాహిద్ దస్తాఘీమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఎస్వైజెడ్) - ఇరాన్ సౌత్ రీజియన్లో ఎమర్జన్సీ ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యతోనే విమానం ఎమర్జన్సీ ల్యాండ్ అయినట్లు ఫ్లై దుబాయ్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. ప్రయాణీకులెవరికీ ఎలాంటి సమస్యలూ రాకుండా తగిన ఏర్పాట్లు చేశామని, షిరాజ్ ఎయిర్ పోర్ట్ నుంచి వారు తమ జర్నీని మరో ఫ్లై దుబాయ్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించారని ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనీ, ఈ కారణంగా ప్రయాణీకులకు తలెత్తిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నామని సంస్థ పేర్కొంది. సాంకేతిక సమస్య ఏర్పడిన విమానం స్థానంలో మరో విమానాన్ని ఎస్వైజెడ్ విమానాశ్రయానికి పంపి, అక్కడి నుంచి ప్రయాణీకుల్ని దుబాయ్ తీసుకొచ్చినట్లు సంస్థ అధికార ప్రతినిథి చెప్పారు. సాంకేతిక సమస్యని పరిష్కరించిన వెంటనే ఆ విమానం కూడా దుబాయ్కి అదే రోజు చేరుకుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!