ఫ్లై దుబాయ్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- October 11, 2019
ఫ్లై దుబాయ్ విమానం బకు నుంచి దుబాయ్ వెళుతూ షిరాజ్ షాహిద్ దస్తాఘీమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఎస్వైజెడ్) - ఇరాన్ సౌత్ రీజియన్లో ఎమర్జన్సీ ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యతోనే విమానం ఎమర్జన్సీ ల్యాండ్ అయినట్లు ఫ్లై దుబాయ్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. ప్రయాణీకులెవరికీ ఎలాంటి సమస్యలూ రాకుండా తగిన ఏర్పాట్లు చేశామని, షిరాజ్ ఎయిర్ పోర్ట్ నుంచి వారు తమ జర్నీని మరో ఫ్లై దుబాయ్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించారని ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనీ, ఈ కారణంగా ప్రయాణీకులకు తలెత్తిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నామని సంస్థ పేర్కొంది. సాంకేతిక సమస్య ఏర్పడిన విమానం స్థానంలో మరో విమానాన్ని ఎస్వైజెడ్ విమానాశ్రయానికి పంపి, అక్కడి నుంచి ప్రయాణీకుల్ని దుబాయ్ తీసుకొచ్చినట్లు సంస్థ అధికార ప్రతినిథి చెప్పారు. సాంకేతిక సమస్యని పరిష్కరించిన వెంటనే ఆ విమానం కూడా దుబాయ్కి అదే రోజు చేరుకుంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







