ఫ్లై దుబాయ్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- October 11, 2019
ఫ్లై దుబాయ్ విమానం బకు నుంచి దుబాయ్ వెళుతూ షిరాజ్ షాహిద్ దస్తాఘీమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఎస్వైజెడ్) - ఇరాన్ సౌత్ రీజియన్లో ఎమర్జన్సీ ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యతోనే విమానం ఎమర్జన్సీ ల్యాండ్ అయినట్లు ఫ్లై దుబాయ్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. ప్రయాణీకులెవరికీ ఎలాంటి సమస్యలూ రాకుండా తగిన ఏర్పాట్లు చేశామని, షిరాజ్ ఎయిర్ పోర్ట్ నుంచి వారు తమ జర్నీని మరో ఫ్లై దుబాయ్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించారని ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనీ, ఈ కారణంగా ప్రయాణీకులకు తలెత్తిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నామని సంస్థ పేర్కొంది. సాంకేతిక సమస్య ఏర్పడిన విమానం స్థానంలో మరో విమానాన్ని ఎస్వైజెడ్ విమానాశ్రయానికి పంపి, అక్కడి నుంచి ప్రయాణీకుల్ని దుబాయ్ తీసుకొచ్చినట్లు సంస్థ అధికార ప్రతినిథి చెప్పారు. సాంకేతిక సమస్యని పరిష్కరించిన వెంటనే ఆ విమానం కూడా దుబాయ్కి అదే రోజు చేరుకుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







