అధ్యయనం పేరిట కాలయాపన వద్దు:మంద భీంరెడ్డి
- October 12, 2019హైదరాబాద్:గల్ఫ్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన నేపథ్యంలో తన అభిప్రాయం తెలిపిన ప్రవాసి కార్మిక నాయకులు మంద భీంరెడ్డి.ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) ముసాయిదా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నది. అధ్యయనం పేరిట కాలయాపన వద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత అయిదు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో గల్ఫ్ దేశాలలో మృతి చెందిన 1261 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానని కెసిఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి.
గల్ఫ్ లో ఉన్నవారిని వాపస్ తెప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలుపడం అనాలోచిత, బాధ్యతారాహిత్యం. సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండానే ప్రకటనలు చేయడం సరికాదు. అధికారుల బృందాన్ని కేరళరాష్ట్రానికి అధ్యయనానికి పంపడం కాలయాపన కొరకే.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో సమగ్ర ప్రవాసి సర్వే నిర్వహించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఎన్నారై ల కొరకు ప్రత్యేక శాఖను ఏర్పాటై చేయాలి. ఒక మంత్రిని నియమించాలి. తెలంగాణ ప్రవాసి సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్, పెన్షన్, స్వయం ఉపాధి లాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!