చంద్రుడి ఉపరితలంపై పెరిగిన వెలుతురు
- October 17, 2019బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్2కి చెందిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆ సంస్థకు చెందిన లూనార్ రికనయిసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) చంద్రుడి దక్షిణ ద్రువానికి సంబంధించిన పలు చిత్రాలను తీసింది. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నామని, విక్రమ్ కు ఏం జరిగిదన్న వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎల్ఆర్వో ప్రాజెక్టు శాస్త్రవేత్త నోహా పెట్రో వెల్లడించారు. మూడు రోజుల క్రితం చంద్రుడి ఉపరితలంపై వెలుతురు పెరిగిందని ఆయన చెప్పారు. గత నెలతో పోలిస్తే దక్షిణ ద్రువ ప్రాంతంలో నీడ తగ్గిందని ఆయన వివరించారు.
గత నెల 17న కూడా దక్షిణ ద్రువం నుంచి ఎల్ఆర్వో వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, అక్కడ వెలుతురు లేని కారణంగా విక్రమ్ ఆచూకీని తెలియరాలేదు. కాగా, విక్రమ్ ల్యాండర్ను గతనెల 7వ తేదీ తెల్లవారుజామున ఇస్రో దక్షిణ ధ్రువంపై దించే కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయపుటంచులవరకు చేరుకొని చంద్రుడిపైకి అడుగుపెడుతుందన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ తెగింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..