ఎక్స్‌పో 2020 దుబాయ్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభం

- October 19, 2019 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభం

అక్టోబర్‌ 20న ప్రారంభం కానున్న ఎక్స్‌పో 2020 దుబాయ్‌ కోసం కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది. విజిటర్స్‌ అలాగే టూరిస్ట్‌లు ఈ ఎక్స్‌పో కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌ 20 నుంచి ఏప్రిల్‌ 21 వరకు ఈ ఎక్స్‌పో సాగుతుంది. రెలామ్‌ ఇన్వెస్టిమెంట్‌ కో-ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఛైర్మన్‌ సుల్తాన్‌ అలి రషెద్‌ లూటాహ్‌ మాట్లాడుతూ, దుబాయ్‌ ఎక్స్‌పో 2020 అత్యద్భుతమైన అనుభూతిని సందర్శకులకు ఇవ్వనుందని అన్నారు. 25 మిలియన్‌ మంది ఈ ఎక్స్‌పోని సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. యూఏఈ వెలుపల నుంచి 70 శాతం విజిటర్స్‌ వుంటారనేది ఓ అంచనా. 60 డెయిలీ ఈవెంట్స్‌ మొత్తంగా 173 రోజులపాటు కొనసాగుతాయి. 192 దేశాల నుంచి 200 పార్టిసిపెంట్స్‌ ఈ ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com