1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న దుబాయ్లోని భారత వలసదారుడు
- October 23, 2019
దుబాయ్: 56 ఏళ్ళ భారత వ్యాపారి కమలాసనన్ నాడార్ వాసు, 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డిడిఎఫ్) మిలీనియం మిలియనీర్ సిరీస్ 314 డ్రాలో గెల్చుకున్నారు. ఈ విషయమై కమలాసనన్ మాట్లాడుతూ, 33 ఏళ్ళుగా తాను స్టీల్ ఫ్యాబ్రికేషన్ కంపెనీ నిర్వహిస్తున్నాననీ, తనకు తాజాగా దక్కిన రాఫెల్ గెలుపుతో వచ్చే మొత్తంతో అప్పులన్నిటినీ తీర్చేస్తానని చెప్పారు. కొంత మొత్తంతో అప్పులు తీర్చేసి, మిగతా మొత్తంతో లైఫ్లో సెటిల్ అయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటానని అన్నారు. డిడిఎఫ్ డ్రాకి తాను రెగ్యులర్ కస్టమర్ననీ ఎనిమిదేళ్ళుగా తాను టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాననీ, గత నెలలో కేరళ వెళుతూ కొనుగోలు చేసిన టిక్కెట్కి విజయం దక్కిందని చెప్పారు కమలాసనన్.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







