1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న దుబాయ్‌లోని భారత వలసదారుడు

- October 23, 2019 , by Maagulf
1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న దుబాయ్‌లోని భారత వలసదారుడు

దుబాయ్‌: 56 ఏళ్ళ భారత వ్యాపారి కమలాసనన్‌ నాడార్‌ వాసు, 1 మిలియన్‌ డాలర్లను దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ (డిడిఎఫ్‌) మిలీనియం మిలియనీర్‌ సిరీస్‌ 314 డ్రాలో గెల్చుకున్నారు. ఈ విషయమై కమలాసనన్‌ మాట్లాడుతూ, 33 ఏళ్ళుగా తాను స్టీల్‌ ఫ్యాబ్రికేషన్‌ కంపెనీ నిర్వహిస్తున్నాననీ, తనకు తాజాగా దక్కిన రాఫెల్ గెలుపుతో వచ్చే మొత్తంతో అప్పులన్నిటినీ తీర్చేస్తానని చెప్పారు. కొంత మొత్తంతో అప్పులు తీర్చేసి, మిగతా మొత్తంతో లైఫ్‌లో సెటిల్‌ అయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటానని అన్నారు. డిడిఎఫ్‌ డ్రాకి తాను రెగ్యులర్‌ కస్టమర్‌ననీ ఎనిమిదేళ్ళుగా తాను టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాననీ, గత నెలలో కేరళ వెళుతూ కొనుగోలు చేసిన టిక్కెట్‌కి విజయం దక్కిందని చెప్పారు కమలాసనన్‌.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com