సౌదీ వీసాల చార్జీల పెంపు..ఆరు రెట్లు పెరగడంతో హజ్ యాత్రికుల్లో ఆందోళన
- October 24, 2019
రియాద్: సౌదీ అరేబియా వీసాల చార్జీలను ఆరు రెట్లకు పెంచింది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సౌదీ పర్యటన ఇకపై భారంగా మారే ప్రమాదముంది. అంతేగాకుండా, హజ్, ఉమ్రా యాత్రలకు వెళ్లే మధ్య తరగతి కుటుంబీకులకు ఈ వీసాల చార్జీల పెంపుదల పెను భారంగా మారనుంది. సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ, ఆరునెలల వీసాలు, ఏడాది వీసాల ఛార్జీలు భారీగా పెరిగాయి. గతంలో 93 డాలర్లు ( రూ.6,583 ) ఉన్న సౌదీ అరేబియా సింగిల్ ఎంట్రీ వీసాల చార్జీలు 533 డాలర్లకు ( రూ.38,731) పెరిగాయి. మల్టిపుల్ ఎంట్రీ, ఆరు నెలల వీసా చార్జీలు పొందాలంటే 800 డాలర్లు ( రూ.56,640 ), ఏడాది వీసాలు పొందాలంటే 1,333 డాలర్లు ( రూ.94,377) చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో వీసా చార్జీలను పెంచడానికి పెద్దగా కారణాలేమీ లేవు అయితే, వీసాల చార్జీల మొత్తాన్ని సమీక్షిస్తామని కొద్దిరోజుల కిందటే చేసిన ప్రకటనకు అనుగుణంగా వీటి రేట్లను పెంచారు. ఒక్క హజ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసమే కాకుండా సౌదీ అరేబియాకు వెళ్లే ప్రతీ విదేశీయుడికి వీసాలను మంజూరు చేయడానికి ఆయా మొత్తాన్ని వసూలు చేస్తుంది ప్రభుత్వం. హజ్ యాత్రకు మినహాయింపేమీ ఇవ్వలేదు. తొలిసారి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ఈ పెంపుదల వర్తించదని సౌదీ అరేబియా ప్రభుత్వం వెల్లడించింది.
సౌదీ అరేబియా ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన సిఫారసుల మేరకే తాము వీసా చార్జీలను పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ పెంపుదలను పలు ముస్లిం దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింల జనాభా అధికంగా ఉండే మొరాకో...హజ్ యాత్రను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. భారీగా పెంచిన వీసాల ఛార్జీలను తగ్గించేంత వరకూ తాము హజ్ యాత్రను బహిష్కరిస్తామని వెల్లడించింది. టర్కీ, ఈజిప్టు, నైజీరియా వంటి దేశాలు సైతం అదే బాటలో నడుస్తున్నాయి. పెంచిన వీసాల చార్జీల తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







