దుబాయ్‌: రూ. పది కోట్లు కాజేసి భార్యను ఇరికించి పరార్..

- October 26, 2019 , by Maagulf
దుబాయ్‌: రూ. పది కోట్లు కాజేసి భార్యను ఇరికించి పరార్..

దుబాయ్: తిండి పెడుతున్న సంస్థకే ఓ వ్యక్తి కన్నం వేశాడు. దుబాయ్‌లోని ఓ స్థానిక బ్యాంకులో పనిచేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన పరపతిని ఉపయోగించి బ్యాంకులోని వివిధ డాక్యుమెంట్లను దొంగిలించి.. వాటి ద్వారా 5.2 మిలియన్ దిర్హామ్‌(రూ. పది కోట్లకు పైనే)లను కాజేశాడు. 2011 నుంచి 2017 జులై వరకు నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో.. దుబాయ్ పోలీసులు నిందితుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాజేసిన డబ్బులో చాలా భాగం.. అతడి భార్య అకౌంట్లకే పంపినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి భార్య కూడా ఏటీఎంలలో ఆ డబ్బును విత్‌డ్రా చేయడం, చెక్కుల ద్వారా డబ్బును ఆమె అకౌంట్ల నుంచి వేరే అకౌంట్లకు పంపించడం చేస్తూ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై కూడా పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే ఈ దోపిడీకి తనకు ఎటువంటి సంబంధం లేదని నిందితుడి భార్య కోర్టుకు తెలిపింది. తన భర్త ఏం చేస్తున్నాడనేది కూడా తనకు ఎన్నడూ చెప్పలేదని జడ్జికి వివరించింది. కాగా, కోర్టు ఈ కేసును నవంబరుకు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com