హుజుర్నగర్పై వరాల జల్లు కురిపించిన కేసీఆర్
- October 26, 2019
తెలంగాణ:ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. అయితే ఈ ఫలితాలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొననున్న కేసీఆర్.. హుజూర్ నగర్ ప్రజలకు భారీ వరాలు ప్రకటిస్తారని సమాచారం.
కాగా ఈ సభకు హైదరాబాద్ నుంచీ కేసీఆర్ రోడ్డు మార్గంలో రానున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం లక్ష మందిని సభకు తరలించాలని టీఆర్ఎస్ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చాలా మంది మంత్రులు అక్కడే ఉండి ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







