నేడే జల్లికట్టు నిషేధం పై దాఖలైన పిటిషన్ విచారణ
- January 12, 2016
జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. కేంద్ర ప్రభుత్వం జల్లికట్టు నిర్వహణపై ఉన్న నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సంప్రదాయం పేరుతో మూగ జీవాలను హింసించడం జంతు సంరక్షణ చట్టం ప్రకారం నేరమని పిటిషన్లో పేర్కొన్నాయి. తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా జల్లికట్టును నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పండుగకు సమయం ఎక్కువగా లేనందున దీనిపై త్వరగా విచారణ చేపట్టాల్సిందిగా భారత జంతు సంరక్షణ బోర్డు, పెటా, బెంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిన్న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను స్వీకరించి... మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









