కంపాట్రియేట్‌ని దోచుకున్న ఇద్దరు ఇండియన్స్‌

- November 02, 2019 , by Maagulf
కంపాట్రియేట్‌ని దోచుకున్న ఇద్దరు ఇండియన్స్‌

కువైట్‌:కంపాట్రియేట్‌ నుంచి 200 దినార్స్‌ దోచుకున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరూ భారత వలసదారులని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు సాద్‌ అల్‌ అబ్దుల్లా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు వివరించారు. కారులో ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా, జన సంచారం లేని ప్రాంతంలో కారుని ఆపి, నిందితుడిపై మిగతా ఇద్దరు దాడి చేసి, అతని వద్దనున్న డబ్బుల్ని లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. జహ్రా హాస్పిటల్‌కి వెళ్ళిన నిందితుడు, అక్కడ వైద్య చికిత్స పొంది, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com