యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి : మోదీ

- January 12, 2016 , by Maagulf
యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి : మోదీ

యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో యువ శక్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. ప్రోత్సహిస్తే యువతదేన్నైనా సాధిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందన్నారు. నైపుణ్యాభివృద్ధి ఉంటే 21వ శతాబ్దం యువతదే అవుతుందన్నారు. ప్రస్తుతం జాతిని నిలబెట్టేందుకు యువత శ్రమిస్తోందని చెప్పారు. దేశానికి ఏం చేయాలని యువత ఆలోచిస్తోందని అన్నారు. పేదరికం లేని దేశంగా భారత్‌ ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లలు పట్టభద్రులైతే తల్లిదండ్రులు గర్వంగా భావిస్తారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com