ఆంధ్రప్రదేశ్తో ట్రైమెక్స్ భారీ ఒప్పందం
- January 12, 2016
హైద్రాబాద్కి కేంద్రంగా పనిచేస్తున్న ట్రైమెక్స్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మైనింగ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్లో భాగంగా భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 2,500 కోట్లు. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కళింగపట్నం బీచ్ శాండ్ ప్రాజెక్టుల కోసం ఈ ఒప్పందం కుదిరింది. ట్రైమెక్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కోనేరు, విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వ ప్రతినిథులతో ఎంఓయూపై సంతకం చేశారు. ఇలమ్మెనైట్, రుటిల్, జిర్కాన్, గార్నెట్, సిల్లిమనైట్ తదితర బీచ్శాండ్ మినరల్స్కి సంబంధించి 17.88 చదరపు కిలోమీటర్ల మేర తవ్వకాలకు ప్రభుత్వంతో లీజ్ ఒప్పందం కుదిరినట్లు కోనేరు ప్రదీప్ చెప్పారు. భావనపాడు ప్రాజెక్ట్ కోసం 1500 కోట్లు వెచ్చించనున్నామనీ, ఈ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధినిస్తుందని ఆయన చెప్పారు. కళింగపట్నంలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్ట్ చేపట్టనున్నామని అన్నారాయన.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







