బహ్రెయిన్‌ డ్రీమ్‌ డెస్టినేషన్‌గా మార్చుతున్నాం

- January 12, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ డ్రీమ్‌ డెస్టినేషన్‌గా మార్చుతున్నాం



బహ్రెయిన్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఇడిబి) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాలిద్‌ అల్‌ రుమైహి ఇటీవల బహ్రెయిన్‌లో తగ్గించిన సబ్సిడీలపై స్పందించారు. దేశ అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా బహ్రెయిన్‌ సమర్థవంతంగా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. బహ్రెయిన్‌ ఆదాయంలో టూరిజం నుంచి వచ్చే భాగం ఎక్కువన్న ఖాలిద్‌, గత ఏడాది 10 మిలియన్‌ టూరిస్టులు బహ్రెయిన్‌లో పర్యటించారని ఆయన చెప్పారు. బహ్రెయిన్‌ ఇంకా అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి పలు ప్రాజెక్టులు చేపడుతున్నామనీ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను బహ్రెయిన్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన వివరించారు. దేశం కోసం ఇడిబి అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఖాలిద్‌ కొనియాడారు. బహ్రెయిన్‌ ఇండియా సొసైటీ ఛైర్మన్‌ మహమ్మద్‌ దాదాభాయ్‌ బహ్రెయిన్‌ నాయకత్వాన్ని అభినందించారు. బహ్రెయిన్‌ ఇండియా సొసైటీ, ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని, ఇండియాతో కింగ్‌డమ్‌ రిలేషన్‌ ఇంకా బలపడుతుందని ఆకాంక్షించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com