బహ్రెయిన్ డ్రీమ్ డెస్టినేషన్గా మార్చుతున్నాం
- January 12, 2016
బహ్రెయిన్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్ (ఇడిబి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఖాలిద్ అల్ రుమైహి ఇటీవల బహ్రెయిన్లో తగ్గించిన సబ్సిడీలపై స్పందించారు. దేశ అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా బహ్రెయిన్ సమర్థవంతంగా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. బహ్రెయిన్ ఆదాయంలో టూరిజం నుంచి వచ్చే భాగం ఎక్కువన్న ఖాలిద్, గత ఏడాది 10 మిలియన్ టూరిస్టులు బహ్రెయిన్లో పర్యటించారని ఆయన చెప్పారు. బహ్రెయిన్ ఇంకా అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి పలు ప్రాజెక్టులు చేపడుతున్నామనీ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను బహ్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన వివరించారు. దేశం కోసం ఇడిబి అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఖాలిద్ కొనియాడారు. బహ్రెయిన్ ఇండియా సొసైటీ ఛైర్మన్ మహమ్మద్ దాదాభాయ్ బహ్రెయిన్ నాయకత్వాన్ని అభినందించారు. బహ్రెయిన్ ఇండియా సొసైటీ, ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని, ఇండియాతో కింగ్డమ్ రిలేషన్ ఇంకా బలపడుతుందని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







