భారత్ దేశం లో దాడికి యత్నించిన ఐసిస్
- November 06, 2019
వాషింగ్టన్: ఒకప్పుడు ఐసిస్ ఉగ్రవాదసంస్థ సిరియా, ఆఫ్ఘానిస్థాన్ వంటి కొన్ని దేశాలకే పరిమితం చేస్తూ దాడులు చేసేవి. అయితే భారత్ వంటి దేశాన్ని కూడా టర్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ గత సంవత్సరం భారత్లోనూ దాడులకు యత్నించిందని ఆయన చెప్పారు. కానీ, వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. ఐసిస్కు చెందిన భొరసన్ గ్రూప్ (ఐసిస్-కె) ఈ మేరకు ప్రణాళికలు రచించిందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ రస్సెల్ ట్రావర్స్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన సెనెటర్ మ్యాగీ హాసన్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఐసిస్కు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థల్లో 'ఐసిస్-కెనే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇన్నాళ్లు కేవలం ఆప్ఘానిస్థాన్పైనే గురిపెట్టిన ఈ సంస్థ గత సంవత్సరం ఇతర ప్రాంతాలకూ తన ప్రణాళికలు విస్తరించిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్కు అనుబంధంగా 20 గ్రూపులు పనిచేస్తున్నాయని గతవారం ట్రావర్స్ ఓ సందర్భంలో తెలిపారు. వీటిలో కొన్ని దాడులకు డ్రోన్లాంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయని వెల్లడించారు. సిరియా, ఇరాక్లో ఐసిస్ని పూర్తిగా తుడిచిపెట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వి
స్తరించిన దాని మూలాలు అమెరికాకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







