భారత్ దేశం లో దాడికి యత్నించిన ఐసిస్
- November 06, 2019
వాషింగ్టన్: ఒకప్పుడు ఐసిస్ ఉగ్రవాదసంస్థ సిరియా, ఆఫ్ఘానిస్థాన్ వంటి కొన్ని దేశాలకే పరిమితం చేస్తూ దాడులు చేసేవి. అయితే భారత్ వంటి దేశాన్ని కూడా టర్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ గత సంవత్సరం భారత్లోనూ దాడులకు యత్నించిందని ఆయన చెప్పారు. కానీ, వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. ఐసిస్కు చెందిన భొరసన్ గ్రూప్ (ఐసిస్-కె) ఈ మేరకు ప్రణాళికలు రచించిందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ రస్సెల్ ట్రావర్స్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన సెనెటర్ మ్యాగీ హాసన్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఐసిస్కు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థల్లో 'ఐసిస్-కెనే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇన్నాళ్లు కేవలం ఆప్ఘానిస్థాన్పైనే గురిపెట్టిన ఈ సంస్థ గత సంవత్సరం ఇతర ప్రాంతాలకూ తన ప్రణాళికలు విస్తరించిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్కు అనుబంధంగా 20 గ్రూపులు పనిచేస్తున్నాయని గతవారం ట్రావర్స్ ఓ సందర్భంలో తెలిపారు. వీటిలో కొన్ని దాడులకు డ్రోన్లాంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయని వెల్లడించారు. సిరియా, ఇరాక్లో ఐసిస్ని పూర్తిగా తుడిచిపెట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వి
స్తరించిన దాని మూలాలు అమెరికాకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







