2021లో యూఏఈ - జాయెద్‌ నేషనల్‌ మ్యూజియం ప్రారంభం

- November 06, 2019 , by Maagulf
2021లో యూఏఈ - జాయెద్‌ నేషనల్‌ మ్యూజియం ప్రారంభం

జాయెద్‌ నేషనల్‌ మ్యూజియం 2021లో ప్రారంభం కానుంది. అబుదాబీ కల్చరల్‌ ప్లాన్‌ - హై ప్రొఫైల్‌ ప్రాజెక్ట్‌లో ఈ మ్యూజియం ఓ భాగం. ప్రస్తుతం ఈ మ్యూజియం నిర్మాణ దశలో వుంది. అబుదాబీలోని సాదియాత్‌ ఐలాండ్‌లోని సాదియాత్‌ కల్చరల్‌ డిస్ట్రిక్ట్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. యూఏఈ ఫౌండింగ్‌ ఫాదర్‌ అయిన షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ చరిత్రను ఈ మ్యూజియం మన కళ్ళ ముందుంచనుంది. డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇంటీరియర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ షేక్‌ సైఫ్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, జాయెద్‌ నేషనల్‌ మ్యూజియం సైట్‌ సందర్శన సందర్భంగా 2021లో మ్యూజియంని ప్రారంభిస్తామని ప్రకటించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ టూరిజం రిప్రెజెంటేటివ్స్‌ ఈ ప్రాజెక్టు వివరాల్ని షేక్‌ సైఫ్‌కి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com