నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి

- January 12, 2016 , by Maagulf
నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి

పైరసీని అరికట్టాల్సిందిగా సినీ నటుడు నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం ద్వారా కేవలం తనకు మాత్రమే కాకుండా మొత్తం సినీ పరిశ్రమకు మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. మంగళవారం సాక్షి టీవీ చానెల్ లో ది ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఇదే సమయంలో ప్రముఖ నటుడు నాగార్జున లైవ్ ద్వారా కేటీఆర్ తో మాట్లాడారు.ముందుగా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున అనంతరం సినిమా వర్గం తరుపున ఒక విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమా రంగాన్ని పైరసీ పట్టి పీడిస్తోందని, దానిని అరికడితే అటూ సినీ పరిశ్రమకు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని గుర్తు చేశారు.ఈ విజ్ఞప్తిని సావధానంగా విన్న కేటీఆర్ చిరునవ్వులు పూయిస్తూ అందుకు సరేనన్నారు. తాను నాగార్జునకు గొప్ప ఫ్యాన్ అని, శివ సినిమా అప్పటి నుంచే అభిమానిగా మారిపోయానని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com