వీల్ ఛెయిర్పై దుబాయ్ రన్ చేసిన సీనియర్ సిటిజన్స్
- November 09, 2019శుక్రవారం జరిగిన దుబాయ్ రన్లో యువకులే కాదు, వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 86 ఏళ్ళ భారత మహిళ కుసుమ్ భార్గవ, వీల్ ఛెయిర్పై పరుగులో పాల్గొనడం గమనార్హం. ఇది చాలా గొప్ప అనుభూతి అనీ, చాలామందిని తాను కలుసుకున్నానని ఆమె చెప్పారు. వీల్ ఛెయిర్పై 5 కిలోమీటర్ల రన్ని ఆమె పూర్తి చేశారు. 78 ఏళ్ళ ఈశ్వరి అమ్మ, తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి 5 కిలోమీటర్ల రన్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను వీల్ ఛెయిర్పై నడిపించారు. తన కుమారుడు దుబాయ్లోని అద్భుతమైన కట్టడాల్ని చూపించేవాడనీ, ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి రోడ్డుపై చూస్తున్నానని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..