బహ్రెయిన్‌లో అఖండ్‌ పథ్‌ నిర్వహణ

- November 09, 2019 , by Maagulf
బహ్రెయిన్‌లో అఖండ్‌ పథ్‌ నిర్వహణ

బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లో సిక్‌ కమ్యూనిటీ మూడు రోజుల పాటు 'అకండ్‌ పథ్‌'ను నిర్వహించనుంది. నవంబర్‌ 13 నుంచి 15 వరకు సల్మాబాద్‌లోని గల్ఫ్‌ ఎయిర్‌ క్లబ్‌ వద్ద ఈ అఖండ్‌ పథ్‌ నిర్వహిస్తారు. సిక్కు మత గురువు గురునానక్‌ 550వ జయంతి వేడుకలు ఇందులో భాగం కానున్నాయి. 1000 మందికి పైగా సిక్కు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కీర్తన్‌ సహా అనేక కార్యక్రమాలు ఇందులో భాగం కానునానయి. అందులో 'రాగి జాత' ప్రత్యేకమైనది. ఎలాంటి బ్రేక్‌ లేకుండా అఖండ్‌ పథ్‌ నిర్వహించడం సిక్కు సమాజం ఓ పవిత్ర కార్యక్రమంగా చేపడుతూ వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com