కువైట్: పరువు తీసిన టిక్ టాక్ వీడియో..మనస్తాపంతో ఉరి
- November 10, 2019ఏ.పి: తన పై ఆరోపణలు చేస్తూ,వేరోక వ్యక్తి టిక్ టాక్ లో విడియో చేసి దానిని వైరల్ చేయడంతో మనస్తాపం కు గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాజోలు మండలం శివకోటి పోస్టాఫీసు వీధి కి చెందిన పుచ్చకాయల మోహన కుమార్ (30)ఉపాధి నిమిత్తం కువైట్ దేశం వెళ్లాడు. అక్కడ పని చేసుకుంటూ ఇంటి వద్ద ఉన్న వాళ్ళ అమ్మ కు డబ్బులు పంపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా 2 వేల రూపాయల కువైట్ డబ్బులు దినర్లు చీటిపాడుకుని కనిపించకుండా పరారిలో ఉన్నాడని తన స్నేహితుడు వడ్డి దుర్గారావు టిక్ టాక్ లో మోహన్ కుమార్ ఫోటోలతో విడియో క్రియేట్ చేసి టిక్ టాక్ లో పెట్టడంతో పరువు పోయిందని మనస్తాపం కు గురైన మోహన్ ఈ నెల 3 వ తేదిన ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండియన్ ఎంబసీ వారు కువైట్ ఎంబసీ తో మాట్లాడి మోహన్ మృతదేహాన్ని ఇండియా కు రప్పిస్తున్నారు. ఉపాధి కొసం వెళ్ళిన తన కొడుకు ఇలా మృతదేహం గా రావడంతో మృతుని తల్లి విజయ కుమారి విలపిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. దీంతో శివకోటి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు