కశ్మీర్పై వెనక్కి తగ్గిన బ్రిటన్ లేబర్ పార్టీ
- November 13, 2019
లండన్: కశ్మీర్లోకి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని, అక్కడ ప్రజలకు నిర్ణయాధికారాన్ని కల్పించాలని బ్రిటన్లోని ప్రధాన ప్రతిపక్షం అయినలేబర్ పార్టీ నాయకుడు జెరెమి కోర్బిన్ గత సెప్టెంబర్లో ఐరాస నేతృత్వంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా అక్కడి భారతీయ వర్గాల నుండి త్రీవస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో తమ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ఛైర్మన్ ఇయాన్ లావెరీ తెలిపారు. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పారు, ఇతర దేశాల వ్వవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. కశ్మీర్పై భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించబోమని, అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించాలంటూ చేసిన తీర్మానం భావోద్వేగ సందర్భంలో తీసుకోవాల్సివచ్చిందని అభివర్ణించారు. కాగా అప్పట్లో భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే లేబర్ పార్టీ ఇటువంటి చర్యలకు దిగిందని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!