హాస్పటల్ లో చేరిన కృష్ణంరాజు..
- November 14, 2019
రెబల్ స్టార్ , కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. కానీ అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొని ఉంది..కుటుంబ సభ్యులెవరైనా ఆయన ఆరోగ్యం గురించి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణం రాజు వయసు 79 ఏళ్లు. రెండు రోజులుగా హైదరాబాద్ లో వాతావరణం మారడడం తో ఈయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే పాల్గొంటూ వస్తున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో కొనసాగుతూనే, మరోవైపు ప్రభాస్ తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ బ్యానర్ పై ఓ సినిమా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!