హాస్పటల్ లో చేరిన కృష్ణంరాజు..
- November 14, 2019రెబల్ స్టార్ , కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. కానీ అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొని ఉంది..కుటుంబ సభ్యులెవరైనా ఆయన ఆరోగ్యం గురించి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణం రాజు వయసు 79 ఏళ్లు. రెండు రోజులుగా హైదరాబాద్ లో వాతావరణం మారడడం తో ఈయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే పాల్గొంటూ వస్తున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో కొనసాగుతూనే, మరోవైపు ప్రభాస్ తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ బ్యానర్ పై ఓ సినిమా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో