ఎంజీఆర్ గా మారిన అరవింద్ స్వామి

- November 15, 2019 , by Maagulf
ఎంజీఆర్ గా మారిన అరవింద్ స్వామి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ 'తలైవి' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తున్నాడు. ఇక కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు పూర్తీ అయ్యాయి.

దీంతో సినిమాలోని ఒక్కో పాత్ర తాలూకా మేకోవర్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా గా ఈ మూవీ లో ఎం.జి.రామచంద్రన్ పాత్ర చేస్తున్న అరవింద్ మేకోవర్ కోసం అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్న వేళా ఆయన తాలూకా పిక్ బయటకొచ్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. అచ్చం అప్పట్లో ఎంజీఆర్ ఎలాగైతే క్లీన్ షేవ్ చేసుకుని ఉండేవారో అలాగే ఉన్నారు అరవింద్ స్వామి.

'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ చేయనుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'తలైవి'గా వస్తున్న ఈ చిత్రం హిందీలో 'జయ' పేరుతో విడుదలకానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com