ఎంజీఆర్ గా మారిన అరవింద్ స్వామి
- November 15, 2019దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ 'తలైవి' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇక కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు పూర్తీ అయ్యాయి.
దీంతో సినిమాలోని ఒక్కో పాత్ర తాలూకా మేకోవర్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా గా ఈ మూవీ లో ఎం.జి.రామచంద్రన్ పాత్ర చేస్తున్న అరవింద్ మేకోవర్ కోసం అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్న వేళా ఆయన తాలూకా పిక్ బయటకొచ్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. అచ్చం అప్పట్లో ఎంజీఆర్ ఎలాగైతే క్లీన్ షేవ్ చేసుకుని ఉండేవారో అలాగే ఉన్నారు అరవింద్ స్వామి.
'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ చేయనుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'తలైవి'గా వస్తున్న ఈ చిత్రం హిందీలో 'జయ' పేరుతో విడుదలకానుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు