అమెరికా వీసా రుసుముల్ని పెంచుతున్నది
- January 13, 2016
అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బి, ఎల్-1 వీసాల్లో కొన్ని విభాగాలకు రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా భారత ఐ.టి. కంపెనీలపై ప్రభావం కనిపించనుంది. హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేసే కొన్ని విభాగాలవారు అదనపు రుసుముగా 4 వేల డాలర్లు (సుమారు రూ.2,60,000) చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. ఎల్-1ఎ, ఎల్-1బి వీసాల్లో కొన్ని విభాగాల నిమిత్తం 4500 డాలర్లు (సుమారు రూ.2,92,500) అదనంగా జమ చేయాలని వివరించింది. ఇతర అన్ని రకాల రుసుములకు ఇవి అదనమనీ, 2025 సెప్టెంబరు 30 వరకు ఇవి అమల్లో ఉంటాయనీ తెలిపింది. నూతన చట్టం ప్రకారం అవసరమైన సమాచారాన్ని సమకూర్చని హెచ్-1బి, ఎల్-1 వీసా దరఖాస్తుల్ని 11. 2.2016 నుంచి తిరస్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









