అమెరికా వీసా రుసుముల్ని పెంచుతున్నది
- January 13, 2016
అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బి, ఎల్-1 వీసాల్లో కొన్ని విభాగాలకు రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా భారత ఐ.టి. కంపెనీలపై ప్రభావం కనిపించనుంది. హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేసే కొన్ని విభాగాలవారు అదనపు రుసుముగా 4 వేల డాలర్లు (సుమారు రూ.2,60,000) చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. ఎల్-1ఎ, ఎల్-1బి వీసాల్లో కొన్ని విభాగాల నిమిత్తం 4500 డాలర్లు (సుమారు రూ.2,92,500) అదనంగా జమ చేయాలని వివరించింది. ఇతర అన్ని రకాల రుసుములకు ఇవి అదనమనీ, 2025 సెప్టెంబరు 30 వరకు ఇవి అమల్లో ఉంటాయనీ తెలిపింది. నూతన చట్టం ప్రకారం అవసరమైన సమాచారాన్ని సమకూర్చని హెచ్-1బి, ఎల్-1 వీసా దరఖాస్తుల్ని 11. 2.2016 నుంచి తిరస్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







