అమెరికా వీసా రుసుముల్ని పెంచుతున్నది

- January 13, 2016 , by Maagulf
అమెరికా వీసా రుసుముల్ని  పెంచుతున్నది

అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాల్లో కొన్ని విభాగాలకు రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా భారత ఐ.టి. కంపెనీలపై ప్రభావం కనిపించనుంది. హెచ్‌-1బి వీసాల కోసం దరఖాస్తు చేసే కొన్ని విభాగాలవారు అదనపు రుసుముగా 4 వేల డాలర్లు (సుమారు రూ.2,60,000) చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. ఎల్‌-1ఎ, ఎల్‌-1బి వీసాల్లో కొన్ని విభాగాల నిమిత్తం 4500 డాలర్లు (సుమారు రూ.2,92,500) అదనంగా జమ చేయాలని వివరించింది. ఇతర అన్ని రకాల రుసుములకు ఇవి అదనమనీ, 2025 సెప్టెంబరు 30 వరకు ఇవి అమల్లో ఉంటాయనీ తెలిపింది. నూతన చట్టం ప్రకారం అవసరమైన సమాచారాన్ని సమకూర్చని హెచ్‌-1బి, ఎల్‌-1 వీసా దరఖాస్తుల్ని 11. 2.2016 నుంచి తిరస్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com