వీధుల్లో వేధిస్తే... షార్జాలో జరిమానాలు
- January 13, 2016
తమ దుకాణాల్లో కొనమని వీధుల్లో వినియోగదారులను వెంటబడి వేధిస్తే , అటువంటి వ్యాపారస్తులపై షార్జా మునిసిపాలిటి జరిమానాలను విధించనుంది. వినియోగాదారులనే కాక, ఆ వీధుల్లో వెళ్ళే సాధారణ పౌరులను సైతం వదలక తమ గుమాస్తాలతో సతాయించేవారిపై సైతం ఇక చర్యలు తీసుకోనున్నారు. జరిమానాను 500 దినార్లగా నిర్ణయించారు. ఇదే తప్పును మరల పునరావృతం చేసిన వ్యాపారులకు అదే జరిమానా రెట్టింపు కానుంది. కొందఱు వ్యాపారులు చేస్తున్న ఈ తంతు విషయమై పలువురు వినియోగదారులు షార్జా మునిసిపాలిటి అధికారులకు పలు పిర్యాదులు ఇచ్చారు.ఇందుకు స్పందించిన షార్జా కేంద్ర మార్కెట్ విభాగాధిపతి ఆబ్దుల్లహ్ ఎబ్రహిం హస్సన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ' ఖలీజ్ టైమ్స్ ' తో మాట్లాడుతూ, వినియోగదారులకు మార్కెట్లో ఏమేమీ
కొనుక్కోవాలో తెలుసునని...వారిని వ్యాపారస్తులు తమ ఉత్పతిని కొనమని , తమ వద్ద ఉన్న వస్తువు ఎంతో మంచిదని నమ్మబలకతు వేధించడం ఏ మాత్రం తగదని ఆయన వ్యాపారులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









