రోడ్డు ప్రమాదంలో ప్లే బ్యాక్ సింగర్ మృతి

- November 15, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ప్లే బ్యాక్ సింగర్ మృతి

మహారాష్ట్ర:మరాఠీ ప్లే బ్యాక్ సింగర్ గీతా మాలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం రోజు తన స్వస్థలమైన నాసిక్‌కి కారులో వెళుతుండగా ముంబై-ఆగ్రా హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటెయినర్‌ని గీతా మాలీ కారు ఢీకొట్టగా, గీతా, ఆమె భర్త తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే వారిని షాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. చికత్స పొందుతూ గీత మృతి చెందారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గీతా మరాఠీలో పలు సినిమా పాటలతో పాటు ఆల్బమ్స్‌కి కూడా పాడింది. ఆమె మృతికి మరాఠీ సినీ పరిశ్రమ సంతాపం తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com