ఛార్థామ్ యాత్ర సీజన్ ముగిసింది
- November 18, 2019డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): చలికాలం సందర్భంగా హిమాలయాల్లో మంచు అధికంగా కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్లో ఉన్న ఛార్థామ్ దేవాలయాన్ని ఆదివారం సాయంత్రం మూసివేశారు. బద్రీనాథ్ దేవాలయంలో సంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు బద్రీనాథ్ -కేదార్నాథ్ మందిర సమితి ప్రకటించింది. ప్రతి ఏటా అక్టోబరు- నవంబరు నెలల్లో భారీగా మంచుకురుస్తుండటంతో హిమాలయాల్లోని బద్రీనాథ్ దేవాలయాన్ని మూసివేస్తుంటారు. వేసవికాలం సమీపించాక ఏప్రిల్-మే నెల్లో మళ్లీ బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఇప్పటికే హిమాలయాల్లో మంచు విస్తారంగా కురుస్తుండటంతో కేదార్నాథ్, గంగోత్రీ, యమునోత్రి దేవాలయాలను ఇప్పటికే మూసివేశారు. బద్రీనాథ్ ఆలయాల మూసివేతతో ఛార్థామ్ యాత్ర సీజన్ ముగిసింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్