లఢక్లో విషాదం.. నలుగురు సైనికులు మృతి
- November 19, 2019
లఢక్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సియాచిన్లోని ఆర్మీ బేస్పై మంచు చరియలు విరిగిపడటంతో నలుగురు సైనికులు మృతిచెందారు. సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమానీనదం వద్ద ఈ ఘటన సంభవించింది. నలుగురు సైనికులు, ఇద్దరు పోర్టర్లు చలికి తట్టుకోలేక మృత్యువాత పడ్డారని ఇండియన్ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది.
మొత్తం 8 మందితో కూడిన పెట్రోలింగ్ బృందం.. మంచు తుఫాను వచ్చిన ప్రదేశంలో విధులు నిర్వహిస్తోంది. 18వేల అడుగుల ఎత్తులో ఉన్నారు. పైగా గడ్డకట్టిన మంచు, మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దీంతో ప్రమాద సమయంలో ఆక్సిజన్ అందక సైనికులు చనిపోయినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. వారిని కాపాడేందుకు ఆర్మీ పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. 8 మందిని బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రయత్నంలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఆ ఇద్దరికీ దగ్గర్లోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
సియాచిన్ కారాకోరం రేంజ్లో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన మిలిటరీ జోన్. అక్కడ ఎప్పుడూ మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సేఫ్టీ మెజర్స్ లేకపోతే క్షణాల్లో రక్తం గడ్డకట్టుకుపోతుంది. అక్కడ వీచే గాలులు అత్యంత ప్రమాదకరం. అయినా భారత సైనికులు ప్రాణాలు లెక్కచేయకుండా సియాచిన్ ప్రాంతంలో పహారా కాస్తుంటారు. దేశరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరు. ఈ క్రమంలోనే మరో నలుగురు సైనికులు దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







