దుబాయ్: ప్రముఖ సోషల్ వర్కర్ 'ఉమా పద్మనాభన్' కు ఆత్మీయ సన్మానం
- November 20, 2019
దుబాయ్: యూఏఈ.. అదో అందమైన దేశం.. ఎంత అందమైనదో అంత కఠినం కూడా! ఎన్నో ఆంక్షలు విధించే ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పొట్ట చేతపట్టుకొని నకిలీ ఏజెంట్ల బారిన పడి ఇక్కడికి వచ్చాక ఎన్నో సమస్యనలు ఎదుర్కొని ఒక్కోసారి కటకటాల బారిన పడిన తమ్ముళ్ల సంఖ్య కోకొల్లలు. అలాంటి వారికి నేనున్నాను అని సాయం అందించే ప్రముఖ సోషల్ వర్కర్ శ్రీమతి ఉమా పద్మనాభన్ (ఉమా ప్యాడీ)..40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించి ఎందరినో ఆదుకున్న ఉమా, దుబాయ్ విడిచి భారతదేశం తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంగా దుబాయ్ లోని 'వేవ్ సంస్థ' మరియు స్నేహితులు, అభిమానులు కలిసి ఉమా పద్మనాభన్ ను సత్కరించి ఆమెకు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా 'వేవ్ సంస్థ' ఫౌండర్ గీతా రమేష్ మాట్లాడుతూ ఆర్తులకు ఉమా అందించిన సేవలు గొప్పవి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు ప్రముఖులు ఉమా తో తమకున్న అనుబంధాన్ని 'మాగల్ఫ్.కామ్' తో పంచుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక