స్టూడెంట్స్‌ ఇండియా కప్‌ గెల్చుకున్న నోబెల్‌ స్కూల్‌

- November 22, 2019 , by Maagulf
స్టూడెంట్స్‌ ఇండియా కప్‌ గెల్చుకున్న నోబెల్‌ స్కూల్‌

నోబెల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, వన్డే ఇంటర్‌ స్కూల్‌ ఫుట్‌ బాల్‌ టోర్నమెంట్‌లో స్టూడెంట్స్‌ కప్‌ని గెల్చుకుంది. దోహా స్టూడెంట్స్‌ కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో ఈ పోటీలు నిర్వహించారు. దోహాలోని 8 ప్రముఖ ఇండియన్‌ స్కూల్స్‌ నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బర్వా సిటీలోని హమిల్టన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఈ పోటీలు జరిగాయి. బిర్లా పబ్లిక్‌ స్కూల్‌, ఈ పోటీల్లో రెండో పొజిషన్‌ సొంతం చేసుకోగా, ఎంఇఎస్‌ ఇండియన్‌ స్కూల్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ మూడో పొజిషన్‌ దక్కించుకున్నాయి. స్టూడెంట్స్‌ ఇండియా మరియు గరల్స్‌ ఇండియా కలిసి యూత్‌ ఫోరమ్‌ అండ్‌ శాంతినికేతన్‌ ఇండియన్‌ స్కూల్‌ అసోసియేషన్‌తో ఈ టోర్నమెంట్‌ని నిర్వహించడం జరిగింది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com