జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6కి వాయిదా
- November 22, 2019జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మొత్తం 11 చార్జిషీటులకు సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 6కి వాయిదా వేసింది. ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. కేవలం ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ మాత్రమే హాజరయ్యారు.
15 రోజుల క్రితం జగన్కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడం సాధ్యంకాదని, ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారిక పర్యటనలో బిజీగా ఉన్నందున ఆయన కోర్టుకు హాజరు కాలేరంటూ జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు