వ్యక్తి మూత్రం తాగి..పేషెంట్ ప్రాణాలు కాపాడాడు
- November 23, 2019ఆలోచించడానికి టైమ్ లేదు.. వైద్యుడిగా మరో ఆలోచన లేకుండా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే అతడి ముందున్న కర్తవ్యం. విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ తోటి ప్రయాణికుడి ఇబ్బందిని గమనించారు. చైనా జువాంగ్జౌ నగరం నుంచి ఓ విమానం న్యూయార్క్కు బయలుదేరింది. మరో 6 గంటల్లో న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం లాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈలోపు 70 ఏళ్ల ఓ వ్యక్తి పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతున్నారు. బాధ భరించరానిదిగా ఉంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ జాంగ్ హాంగ్ తోటి ప్రయాణికుడి పరిస్థితిని గమనించారు. ఆయన ప్రోస్టేట్ గ్రంధి వ్యాకోచంతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. మూత్రాశయం నుంచి తరచుగా మూత్రాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుందని లేకపోతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గుర్తించారు. మరో ఆలోచన లేకుండా పేషెంట్ మూత్ర ద్వారానికి డాక్టర్ ఓ ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని బయటకు పీల్చారు. అలా పీల్చిన మూత్రాన్ని ఓ ఖాళీ వైన్ బాటిల్లో పోస్తూ మూత్రాశయాన్ని ఖాళీ చేసి అతడిని ప్రాణాపాయం నుంచి రక్షించారు.
తాజా వార్తలు
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు