ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 50 వ సదస్సు...

- November 23, 2019 , by Maagulf
ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 50 వ సదస్సు...

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్టపతి రామనాథ్ కోవింద్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.  23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.  గిరిజన సమస్యలు, వ్యవసాయంలో సంస్కరణలు, జల్ జీవన్ మిషన్, ఉన్నత విద్యలో కొత్త విద్యా విధానం, సులభతర జీవనానికి కావలసిన పాలన తదితర అంశాలపై చర్చించనున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.  ఇది రాష్ట్రపతి అధ్యక్షతన జరుగుతున్న 50వ గవర్నర్ల సదస్సు కాగా, రామనాథ్ కోవింద్ అధ్యక్షతన మూడోది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com