ఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 50 వ సదస్సు...
- November 23, 2019న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్టపతి రామనాథ్ కోవింద్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. గిరిజన సమస్యలు, వ్యవసాయంలో సంస్కరణలు, జల్ జీవన్ మిషన్, ఉన్నత విద్యలో కొత్త విద్యా విధానం, సులభతర జీవనానికి కావలసిన పాలన తదితర అంశాలపై చర్చించనున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఇది రాష్ట్రపతి అధ్యక్షతన జరుగుతున్న 50వ గవర్నర్ల సదస్సు కాగా, రామనాథ్ కోవింద్ అధ్యక్షతన మూడోది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!