గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ...
- November 25, 2019
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. 2.30 గంటల సమయంలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై భేటీ జరగబోతుంది. రాజ్ భవన్ లో వీరిద్దరి భేటీ జరగబోతుంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ గురించి గవర్నర్, సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై తన నిర్ణయాన్ని గవర్నర్ కు వివరించనున్నారు. అసెంబ్లీ సమావేశాల గురించి కూడా సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముఖ్యమైన వివరాలను సీఎం కేసీయార్ గవర్నర్ కు వివరించబోతున్నారని సమాచారం. కొత్త రెవిన్యూ చట్టం గురించి కూడా కేసీఆర్ గవర్నర్ తో చర్చించబోతున్నారని సమాచారం. ఆర్టీసీ సమ్మె , ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాల గురించి ముఖ్యంగా కేసీఆర్ , గవర్నర్ మధ్య చర్చ జరగబోతుందని సమాచారం. దాదాపు 90 రోజుల తరువాత గవర్నర్, సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారు.
ఆర్టీసీపై ప్రభుత్వ విధానం, కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలకమైన విషయాలను సీఎం కేసీఆర్ గవర్నర్ కు వివరించనున్నట్లు సమాచారం. గత మూడు నెలలలో జరిగిన పరిణామాల మీద కేసీఆర్ గవర్నర్ తో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. 52 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి సమ్మె విరమిస్తామని కార్మికులు ప్రకటించినా ప్రభుత్వం కార్మికులను ఎందుకు విధుల్లోకి తీసుకోకపోవటానికి కారణాలను సీఎం కేసీఆర్ గవర్నర్ కు వివరించనున్నారు.
కార్మికులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా గవర్నర్ కు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత కొన్ని పార్టీల నేతలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె గురించి గవర్నర్ తమిళిసైని కలిశారు. రెవిన్యూ శాఖలో సీఎం కేసీఆర్ చేయబోతున్న ప్రక్షాళన గురించి కూడా కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి వివరించబోతున్నారని సమాచారం. సీఎం కేసీఆర్, గవర్నర్ భేటీ తరువాత కొన్ని కీలకమైన నిర్ణయాలను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







