గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ...
- November 25, 2019
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. 2.30 గంటల సమయంలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై భేటీ జరగబోతుంది. రాజ్ భవన్ లో వీరిద్దరి భేటీ జరగబోతుంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ గురించి గవర్నర్, సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై తన నిర్ణయాన్ని గవర్నర్ కు వివరించనున్నారు. అసెంబ్లీ సమావేశాల గురించి కూడా సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముఖ్యమైన వివరాలను సీఎం కేసీయార్ గవర్నర్ కు వివరించబోతున్నారని సమాచారం. కొత్త రెవిన్యూ చట్టం గురించి కూడా కేసీఆర్ గవర్నర్ తో చర్చించబోతున్నారని సమాచారం. ఆర్టీసీ సమ్మె , ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాల గురించి ముఖ్యంగా కేసీఆర్ , గవర్నర్ మధ్య చర్చ జరగబోతుందని సమాచారం. దాదాపు 90 రోజుల తరువాత గవర్నర్, సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారు.
ఆర్టీసీపై ప్రభుత్వ విధానం, కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలకమైన విషయాలను సీఎం కేసీఆర్ గవర్నర్ కు వివరించనున్నట్లు సమాచారం. గత మూడు నెలలలో జరిగిన పరిణామాల మీద కేసీఆర్ గవర్నర్ తో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. 52 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి సమ్మె విరమిస్తామని కార్మికులు ప్రకటించినా ప్రభుత్వం కార్మికులను ఎందుకు విధుల్లోకి తీసుకోకపోవటానికి కారణాలను సీఎం కేసీఆర్ గవర్నర్ కు వివరించనున్నారు.
కార్మికులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా గవర్నర్ కు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత కొన్ని పార్టీల నేతలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె గురించి గవర్నర్ తమిళిసైని కలిశారు. రెవిన్యూ శాఖలో సీఎం కేసీఆర్ చేయబోతున్న ప్రక్షాళన గురించి కూడా కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి వివరించబోతున్నారని సమాచారం. సీఎం కేసీఆర్, గవర్నర్ భేటీ తరువాత కొన్ని కీలకమైన నిర్ణయాలను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







