శబరిమల వెళ్లేందుకు యత్నించిన బిందు అమ్మిని పై కారంపొడితో దాడి
- November 26, 2019
శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కొచ్చి వచ్చిన బిందు అమ్మిని అనే భక్తురాలిపై దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనంతరం ఆమెకు వ్యతిరేకంగాకొచ్చిలో నిరసన చేపట్టారు. దీనిపై బిందు అమ్మిని మాట్లాడుతూ..తనను అడ్డుకోవటమే కాకుండా..తనపై దాడి చేసి.. కొంతమంది తన ముఖంపై కారం పొడి చల్లారంటూ బిందు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన కొంతమంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా..సామాజిక కార్యకర్త..మహిళా హక్కుల నేత తృప్తీ దేశాయ్తో బిందు శబరిమల వెళ్లే ప్రయత్నం చేశారు. దాని కోసం తమకు భద్రత కల్పించాలంటూ పోలీసు కమీషనర్ ఆఫీసుకు వచ్చారు. అదే సమయంలో బిందు అమ్మిని పై ఆందోళన కారులు కారంపొడి, పెప్పర్తో దాడి చేశారు. బిందు అమ్మిని కేరళలోని కన్నూరు వర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్వసం సందర్భంగా తాము శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకుంటామని మహిళా హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్ తెలిపారు. ( ఈరోజుకు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు) రాజ్యాంగం పురుషులకు, మహిళలకు సమాన హక్కులను ఇచ్చింది. కాబట్టి తాము అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుని తీరుతామని ఆమె స్పష్టం చేశారు. తమకు పోలీసులు సెక్యూర్టీ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆలయానికి వెళ్లి తీరతామని తృప్తీ దేశాయ్ అన్నారు. ఈ క్రమంలో తమపై దాడి జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహించాలన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!