సౌదీ-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు..
- November 30, 2019
యూఏఈలో తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దుబాయ్ చేరుకున్న సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ను యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ జబీల్ ప్యాలెస్ లో సాదరంగా స్వాగతించారు.
అనంతరం జరిగిన భేటీలో సౌదీ రాజు, ఆయన ప్రతినిధులు బ్రృందంతో షేక్ మొహమ్మద్ ఇతర అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం అందిపుచ్చుకోవటంపై చర్చించారు.
అంతకుముందు యూఏఈ రాజధాని అబుదాబిలో మంగళవారం పర్యటించిన సౌదీ రాజును అబుదాబి క్రొన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ బలగాల డిప్యూటీ కమాండర్ నుంచి సాదర స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య నాలుగు కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో జరిగిన సౌదీ-ఎమిరాటి సమన్వయ మండలి సమావేశంలో ఈ మేరకు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అలాగే ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉండే 7 వ్యూహాత్మక అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!