తెలంగాణ:ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాల జల్లు..
- December 01, 2019
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఈరోజు ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశం ఏర్పటు చేసిన కేసీఆర్..సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసానిచ్చారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేట్ బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమన్నారు.
ఇక వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని కార్మికులకు సూచించారు. ప్రతీ ఏడాది రూ.1000 కోట్లు లాభం ఆర్టీసీకి రావాలి. ప్రతీ ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష బోనస్ అందుకునే స్థితికి తీసుకరావాలని పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









