తెలంగాణ:ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాల జల్లు..
- December 01, 2019
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఈరోజు ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశం ఏర్పటు చేసిన కేసీఆర్..సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసానిచ్చారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేట్ బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమన్నారు.
ఇక వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని కార్మికులకు సూచించారు. ప్రతీ ఏడాది రూ.1000 కోట్లు లాభం ఆర్టీసీకి రావాలి. ప్రతీ ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష బోనస్ అందుకునే స్థితికి తీసుకరావాలని పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







