దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు..
- December 06, 2019
భారత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ హత్య కేసు నిందితులను షాద్నగర్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశువులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే మృతి చెందటంతో.. దిశకు సరైన న్యాయం జరిగిందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అటు దిశ తల్లిదండ్రులు కూడా.. నిందితులకు తగిన శిక్ష పడిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కునేందుకు నిందితులు ప్రయత్నించిన సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సీపీ సజ్జనార్.. గతంలో వరంగల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ యువతిపై యాసిడ్ అటాక్ జరిగింది. ఇక అప్పట్లో దాడి చేసిన నిందితులను వరంగల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు.ఇప్పుడు దిశ అత్యాచారం కేసులో కూడా నిందితులను ఎన్కౌంటర్ చేశారు. ప్రస్తుతం సజ్జనార్ సైబరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా, నిందితులను తక్షణమే ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేశారు. అటు సజ్జనార్ను కూడా పలు సందర్భాల్లో కలిసి ఎన్కౌంటర్ చేయాలని చాలామంది విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పుడు ఈ ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







