దుబాయ్:ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ వేడుకలు
- December 06, 2019
దుబాయ్: గత శుక్రవారం సాయంత్రం దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ లో ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు మరియు ప్రముఖ కమెడియన్ డా.బాబు మోహన్ ముఖ్య అతిధిగా మరియు మోమిన్(లీగల్ కన్సల్టెంట్),బందెల రాజేస్ అతిధిలుగా విచ్చేశారు.దైవజనులు గొల్ల ఎలీషా ఆధ్వర్యంలో సంఘ క్వయర్ వారిచే మధురగీతములు వినిపించబడ్డాయి.ముఖ్య ప్రసంగీకులుగా దైవజనులు గొల్ల జాకబ్ చక్కని వాక్యోపదేశాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక జీవితం, దైవిక లక్షణాలు కలిగి ఉండాలని సంఘాన్ని ఆత్మీయంగా హెచ్చరించారు.
మాజీ మంత్రివర్యులు, ప్రముఖ సినీనటుడు డా.బాబు మోహన్ ముఖ్య అతిధిగా రావటం, వారియెక్క అమూల్యమైన సాక్షము, జీవితపు విలువలను తమదైన శైలిలో అందించారు. అందరిని ఆనంద సాగరంలో ముంచేసారు.అతిధిగా విచ్చేసిన యౌవన సువార్తికుడు బందెల రాజేస్ ఇచ్చిన హెచ్చరికలు అందరినీ ఆలోచింపజేసాయి.అంతర్జాతీయ సువార్త గాయకురాలు సిస్టర్ సుజాత తమ మధురమైన స్వరముతో దేవున్ని మహిమపరిచారు.చిన్నబిడ్డలు వర్ధిల్, ఆరాధ్య మరియు ప్రిన్సి గంభీరముగా పాడిన చక్కని పాటతో అందరినీ ఆనందములో ముంచెత్తారు.చివరిగా ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ అనంతరం అందరూ విందు లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అనురాధ ఓబిలిశెట్టి(లీగల్ కన్సల్టెంట్),షాలేం బాబు(లీగల్ కన్సల్టెంట్) శ్రీకాంత్ చిత్తర్వు(మాగల్ఫ్ చీఫ్ ఎడిటర్) మరియు APNRT కో-ఆర్డినేటర్లు వాసురెడ్డి, ఖాదర్ బాషా,రవి కిరణ్,గుండెల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు