ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందితే అమిత్షాపై ఆంక్షలు: యుఎస్ కమిషన్
- December 10, 2019Washington: భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ (సిఎబి)పై అమెరికాలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన కమిషన్ (యుఎస్ కమిషన్) అభ్యంతరం వ్యక్తం చేసింది.
"తప్పుడు మార్గంలో తీసుకున్న ప్రమాదకర మలుపు"గా ఈ బిల్లును యుఎస్
కమిషన్ అభివర్ణించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందితే రక్షణ మంత్రి అమిత్షాపై ఆంక్షలు విధించాలని కమిషన్ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ బిల్లు ప్రకారం 2014 డిజెంబర్ 31వ తేదీలోగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలనుంచి భారత్కు వలస వచ్చిన హిందువుల, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లపై వేధింపులు ఉండవు. వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు.
లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై తాము తీవ్రంగా ఆందోళనకు గురయ్యామని యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యుఎస్సిఐఆర్ఎఫ్) పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్